తెలంగాణ లోని హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్కు చెందిన అలుగోజు ప్రేమలత, ఉమాచారిలకు ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రెండో కుమారుడు అభిషేక్(23) హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. మూడు నెలల కిందటే అభిషేక్కు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వారం రోజుల కిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామం కంఠాత్మకూర్కు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతణ్ని హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించగా, మంగళవారం బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల అంగీకారంతో అభిషేక్ అవయవాలు దానం చేశారు.
ఉద్యోగ ముచ్చట తీరకుండానే మృతి ఒడిలోకి....!
September 28, 2022
0