22 ఏళ్లుగా స్నానం చేయని ధరమ్​దేవ్ రామ్

Telugu Lo Computer
0


బీహార్ లోని పాల్​గంజ్ జిల్లా,  బైకుంఠపుర్​కు చెందిన  ధరమ్​దేవ్ రామ్ వయస్సు 67 ఏళ్లు. ధరమ్ దేవ్ 2000 సంవత్సరం నుంచి స్నానం చేయకుండా ఉంటున్నారు. ఒక్కరోజు స్నానం చేయకపోతేనే చిరాగ్గా ఉంటుంది. పైగా చెమట కంపు కొడుతుంటుంది. కానీ 22 ఏళ్లుగా స్నానం చేయకపోయినా ధరమ్ దేవ్ శరీరం నుంచి దుర్వాసన లేదు. ఎప్పుడూ అనారోగ్యబారిన కూడా పడలేదు. చక్కటి ఆరోగ్యంతో ఉన్నాడు. ధరమ్ దేవ్ కు 40 ఏళ్ల వయసు ఉండగా మహిళలపై నేరాలు, భూ వివాదాలు, జంతు వధలు అరికట్టే వరకు స్నానం చేయనని శభధం చేశాడు. అలా అప్పటినుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఆయన బంధువులు ఎవరు చనిపోయినా స్నానం మాత్రం చేయలేదు. అతని ప్రతిజ్ఞకు కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. ఆఖరికి 2003లో ధరమ్ దేవ్ భార్య మాయాదేవి చనిపోయినప్పుడు కూడా స్నానం చేయలేదు. అంతేకాదు ధరమ్ దేవ్ ఇద్దరు అబ్బాయిలు చనిపోయిన తర్వాత కూడా వారి శరీరాలపై చుక్క నీరు పోయలేదు..తను కూడా స్నానం చేయలేదు. అతని గురించి తెలిసిన ఆయన బంధువులు..స్థానికులు అతని సంకల్పాన్ని ప్రోత్సహిస్తారే తప్ప ఎప్పుడు ఒక్కమాటకూడా అనరు. ఆశ్చర్యకరంగా.. ధరమ్‌దేవ్‌కు ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదు. ధరమ్​దేవ్ రామ్ 1975లో బెంగాల్ లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసేవాడు.1978లో వివాహం జరిగింది. 1987లో భూ తగాదాలు, జంతు వధలు, మహిళలపై నేరాలు పెరగడం గురించి తెలిసి బాధపడేవాడు. ఎందుకు జనాలు ఇలా ఉంటారు అని తలచుకుని తీవ్రంగా మధనపడేవాడు. అలా ఆ ఆవేదన కాస్తా ఇవన్నీ జరగటం ఆగేవరకు స్నానం చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. అలా ధరమ్‌దేవ్ ఇవన్నీ ఆగేవరకు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఓ గురువుని ఆశ్రయించాడు ధరమ్​దేవ్. 6 నెలలు గడిపిన అనంతరం అతడు అప్పటి నుంచి స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నారు. ధర్మదేవుడు శ్రీరాముడిని ఆదర్శంగా భావించి ఆయన మాటలను గుర్తు చేసుకుంటూ జీవిస్తాడు. 22 ఏళ్ల నుంచి నుంచి స్నానం చేయకపోయినా ధరమ్​దేవ్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)