నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ను ఈ ఏడాది నీట్ పరీక్ష జులై 17న ముగిసింది. దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీట్-2022 ఆన్సర్ కీ జులై 31న రిలీజ్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తుది ఫలితాలు ఆగస్టు 18 - 31 మధ్య విడుదలవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం నీట్ కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీట్ ఫలితాల ప్రకటనకు ఇంకా సమయం ఉంది. అయితే మంచి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తమ టార్గెట్ అని అభ్యర్థులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి 91,927 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఢిల్లీలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1247 సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రైవేట్ కాలేజీల్లో 4,825సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లో 5070 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూపీలో ప్రైవేట్ సీట్లు 4,303 కాగా, ప్రభుత్వ సీట్లు 4,750. చండీగఢ్లో కేవలం ప్రైవేట్ సీట్లు 150 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్- ప్రభుత్వ మెడికల్ సీట్లు వరుసగా ఉత్తరాఖండ్లో 700- 450, చత్తీస్ గఢ్లో 956-600, గుజరాత్లో 3,700- 2000, హర్యానాలో 710 - 950, జార్ఖండ్ 680- 250, మధ్యప్రదేశ్ 2180 -1900, హిమాచల్ ప్రదేశ్ 770 - 150, బీహార్ 1,515 - 900, పంజాబ్ 800- 950, రాజస్థాన్ 3,055 - 950, జమ్మూ కాశ్మీర్ 1,047 - 100, ఏపీ 2,485 - 2850, తమిళనాడు 5,225 - 5500, కర్ణాటక 3,150 - 6,995, కేరళ 1,555 - 2700, పశ్చిమ బెంగాల్ 3,225 - 1000, ఒడిషా 1,375 - 750, తెలంగాణ 1,840 - 3200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పాస్ కావాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 50 పర్సంటైల్ స్కోర్ సాధించాలి. ఈ ఏడాది నీట్ కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో సీటు సాధించడానికి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈసారి పేపర్ గత సంవత్సరం కంటే కఠినంగా ఉంది. కట్-ఆఫ్ కూడా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే, నీట్ 2022లో దాదాపు 600 మార్కులు సాధించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.
Post Top Ad
adg
Friday, 29 July 2022
Home
927 ఎంబీబీఎస్ సీట్లు
National
తుది ఫలితాలు ఆగస్టు 18 - 31 మధ్య విడుదల
దేశంలో 91
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్
దేశంలో 91,927 ఎంబీబీఎస్ సీట్లు
దేశంలో 91,927 ఎంబీబీఎస్ సీట్లు
Tags
# 927 ఎంబీబీఎస్ సీట్లు
# National
# తుది ఫలితాలు ఆగస్టు 18 - 31 మధ్య విడుదల
# దేశంలో 91
# నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్
About Telugu Post
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్
Tags
927 ఎంబీబీఎస్ సీట్లు,
National,
తుది ఫలితాలు ఆగస్టు 18 - 31 మధ్య విడుదల,
దేశంలో 91,
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment