విదేశీయురాలిపై అత్యాచారం

Telugu Lo Computer
0


భర్తతోపాటు పర్యటనకు వచ్చిన బ్రిటిష్ దేశీయురాలు గోవాలో అత్యాచారానికి గురైంది. బ్రిటన్‌కు చెందిన ఒక జంట సరదాగా గడిపేందుకు గోవా వచ్చారు. ఈ నెల 2న గోవాలోని అరంబోల్ స్వీట్ వాటర్ బీచ్‌లో మహిళ ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, జోయెల్ విన్సెంట్ డిసౌజా అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముల్తానీ మట్టితో మసాజ్ చేస్తానంటూ వెళ్లిన జోయెల్, ఆమెపై అత్యాచారం చేశాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. వెంటనే మహిళ భర్త బ్రిటిష్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాడు. వారు గోవా పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవా పోలీసులు నిందితుడిని స్థానికుడిగా గుర్తించారు. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)