రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

Telugu Lo Computer
0


తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలో రైల్వే శాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈస్ట్‌కోస్ట్‌, అజంత, రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆందోళన కారులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఎంఎంటీఎస్ రైళ్లపై దాడి చేయడం, షాపులు, ఫర్నీచర్ వంటి ఇతర రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం, పార్సిళ్లు తగలబెట్టడం వంటివి కూడా జరిగాయి. రెండు పార్శిల్ వ్యాన్లు సహా మూడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. 77 బోగీల అద్దాలు, ఎనిమిది లోకోమోటివ్ అద్దాలు పగిలిపోయాయి. 20 ద్విచక్ర వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇవన్నీ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా శుక్రవారం జరిగిన ఘటనలో ప్రాథమిక అంచనా ప్రకారం సికింద్రాబాద్ రైల్వే శాఖకు దాదాపు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)