ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా యాడికిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మరణించాడు. వివేకా హత్య కేసులో.. ఇప్పటికే గంగాధర్ రెడ్డి ని సీబీఐ విచారణ చేసింది. దాదాపు మూడు సార్లు కడప జిల్లా కేంద్రానికి పిలిపించుకుని సీబీఐ గంగాధర్ రెడ్డి ని ప్రశ్నించింది. నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కి గంగాధర్ రెడ్డి అనుచరుడు. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో గంగాధర్ రెడ్డి ఉండేవాడు. స్వగ్రామం పులివెందుల నుంచి యాడికి వచ్చిన గంగాధర్ రెడ్డి ప్రాణముప్పు ఉందని రెండు సార్లు ఎస్పీని కలిశారు. రక్షణ నిమిత్తం అనంతపురం ఎస్పీని ఇప్పటికే గంగాధర్ రెడ్డి కలిశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశాడు గంగాధర్ రెడ్డి. రాత్రి నిద్రలోనే గంగాధర్ రెడ్డి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివేకా హత్యకేసులో ప్రధాన సాక్షి గంగాధర్రెడ్డి మృతి
June 09, 2022
0
Tags