రెండేళ్లుగా అక్కాచెల్లెళ్లపై అత్యాచారం!

Telugu Lo Computer
0


సికింద్రాబాద్‌లో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రేమ పేరుతో మోసం చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నవాజ్‌ (21), ఇంతియాజ్‌ (21)ను అంబర్‌పేట్‌ వాసులుగా గుర్తించారు. అక్క, చెల్లెల్ని ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)