కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్లోని మాన్సా గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సోమవారం రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, హర్యానా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ తన్వర్ సహా పలువురు మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా అశోక్ తన్వర్ మాట్లాడుతూ సిద్ధూ చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాడన్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడని, అలాంటి మహోన్నత కళాకారుడి అకాల మరణం ఆయన కుటుంబానికే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు తీరని లోటన్నారు. హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, మూసేవాల హత్యకు కారకులైన నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు.
సిద్ధూ మూసేవాలా కుటుంబాన్నిపరామర్శించనున్న రాహుల్
June 06, 2022
0
Tags