దేశంలో 4,041 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 4,041 కొత్త కోవిడ్ కేసులునమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్‌కు గురైనవారి సంఖ్య 4,31,68,585కి చేరింది. ప్రస్తుతం  21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్తగా 1,668 యాక్టివ్ కేసులు సంఖ్య పెరిగింది. 10 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,651 కి చేరింది. దేశంలో నిన్న 2,363 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,22.757కి చేరింది.రికవరీ రేటు 98.74 శాతం గా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. 12,05,840 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 193,83,72,365 వ్యాక్సిన్ డోసులు అందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)