దేశంలో కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది. ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. వారంరోజుల క్రితం వరకు కొవిడ్ వ్యాప్తి తగ్గింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వెయ్యి లోపు నమోదయ్యాయి. వారం రోజుల నుంచి కొవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. 3,010 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసులు 19, 719 (0.05)కి పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ తో చికిత్స పొందుతూ 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్లకు పైగా కేసులు రాగా 5.23 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. 13.98 లక్షల మంది టీకా వేయించుకోగా, మొత్తం ఇప్పటి వరకు 189 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీలో 1,354 మందికి వైరస్ సోకగా, పాజిటివిటీ రేటు 7.64 శాతానికి పెరిగింది. ముంబయిలో 117 కేసులు రాగా ఫిబ్రవరి 24 తరువాత ఇవే అత్యధికం కావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)