టైర్‌లో గాలి నింపుతుండగా పేలి ఇద్దరు దుర్మరణం

Telugu Lo Computer
0

 

చత్తీస్‌ఘడ్‌లోని రాయ్ పూర్ జిల్లా సిల్తారా ఇండస్ట్రీయల్ ఏరియాలోని వెహికల్ వర్క్ షాప్‌లో జేసీబీ టైర్‌లో గాలి నింపుతుండగా పేలి ప్రమాదం జరిగింది. పెద్ద టైర్ లో వర్కర్ గాలిని నింపుతున్న సన్నివేశం సీసీటీవీ కెమెరాలో  రికార్డ్ అయింది. ఇంకో వ్యక్తి టైర్ లో గాలి ఎంత ఉందని చూసేందుకు రెండు మూడు సార్లు నొక్కి చూశాడు. వెంటనే ప్రమాదం జరగడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయారు. రికార్డ్ అయిన వీడియోలో టైర్ పేలి గాల్లోకి ఎగిరినట్లు కనిపించింది. వారిద్దరూ మధ్యప్రదేశ్ లోని రెవా జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. టైర్ పేలిన సమయంలోనే మృతి చెందారని, మరింత సమాచారం కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)