దేశంలో 3,205 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ 31 మంది ప్రాణాలొదినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3.27 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,205 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఢిల్లీలో 1,414 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముందురోజు కంటే 32శాతం అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.97 శాతానికి చేరింది. ఇక 24గంటల వ్యవధిలో 2,802 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు 19,509కి చేరాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)