సీపీఎం తమిళనాడు 23వ రాష్ట్ర మహాసభలు గత నెల 30న ప్రారంభమై శుక్రవారంతో ముగిశాయి. మహాసభలకు మొత్తం 533 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చివరి రోజైన నూతన కార్యవర్గం ఎంపికైంది. 15 మంది రాష్ట్ర కార్యదర్శివర్గం, 79 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. ఈ మహాసభలో 72 ఏళ్లు పైబడిన జి.రామకృష్ణన్, టీకే రంగరాజన్, ఎ.సౌందర్రాజన్లకు కార్యవర్గం నుండి విశ్రాంతి కల్పించారు. రాష్ట్ర కార్యదర్శిగా కె.బాలకృష్ణన్ రెండవసారి ఎన్నికైయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వాసుకి, పి.సంపత్, సెల్వసింగ్, ఎంఎన్ఎస్ వెంకట్రామన్, ఎస్.నూర్ మహమ్మద్, ఎన్.గుణశేఖరన్, కె.కనకరాజ్, మదుకూర్ రామలింగం, ఎస్.వెంకటేశన్, కె.బాలభారతి, జి.సుకుమారన్, కె.సామువేల్రాజ్, ఎస్.కన్నన్లు ఎంపికయ్యారు.
తమిళనాడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా కె.బాలకృష్ణన్
April 02, 2022
0
Tags