విద్యార్థి చెయ్యి కొరికిన టీచర్ !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా డిగ్రీ కళాశాలలో బీఏ పరీక్షల్లో కాపీ కొడుతున్న విద్యార్థి తీరు నచ్చక ఆ టీచర్ ఏకంగా చేయి కొరికిన సంఘటన విస్మయం కలిగిస్తోంది. కాపీ కొడుతున్న విద్యార్థిని అధ్యాపకుడు తొలుత మందలించారట. ఆ సమయంలో ఇద్దరి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన టీచర్ విద్యార్థి చెయ్యి కొరికినట్లు సమాచారం. రెండు రోజుల కిందటి జరిగిన ఈ విషయం శుక్రవారం బయటకు పొక్కగా ఈ సంఘటనపై సదరు టీచర్ మౌనంగా ఉన్నాడట. కానీ కొందరు విద్యార్థులు ఈ సంఘటనను సోషల్ మీడియాలో వైరల్‌ పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)