ఐటి ఉద్యోగం చేస్తూ గంజాయి విక్రయం ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మల్కాజిగిరి, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ లలో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా పెంచారు. దీంతో ఒక ఐ.టి ఉద్యోగిని బండారం బయటపడింది. కొండపనేని మాన్సీ అనే యువతి నాచారం లో ఉన్న ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఇక సాఫీగా ఉద్యోగం చేస్తూ  గంజాయి కూడా విక్రయిస్తుంది. తన భర్త మదన్ తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయించడం ప్రారంభించింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవలే మార్చి 12వ తేదీన దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతూ ఉండగా  బోయిన్ పల్లి పోలీసులు  అరెస్టు చేయడానికి వెళ్లారు. అయితే 1.2 కిలోల గంజాయి తో  యువకులు ఇద్దరు పోలీసులకు చిక్కగా దంపతులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు చిక్కిన యువకులు ఇచ్చిన సమాచారంతో మాన్సీ నీ పట్టుకున్నారు పోలీసులు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. చివరికి ఇక గంజాయి డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)