లోయలో పడిన టాటా సుమో : ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్​లోని పుంఛ్​ జిల్లాలో పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తున్నప్పుడు టాటా సుమో అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తలించారు. సురన్‌కోట్‌ లోని మర్హా గ్రామం నుంచి బుఫ్లియాజ్ వైపు వెళ్తున్న టాటా సుమో వాహనం రోడ్డుపై అదుపు తప్పి తరన్ వాలీ వద్ద వాగులోకి దూసుకెళ్లింది. రోడ్డుపై నుంచి వెళ్తున్న సుమో తరన్ వలీ వద్ద అదుపుతప్పి లోయలో పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)