దేశంలో తాజాగా 2,593 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ తో కొత్తగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,755 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 57 వేల 545కి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల 193గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59శాతానికి పైగా నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,873 (0.04శాతం)గా ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,19,479గా ఉంది.
దేశంలో 2,593 కరోనా కేసులు నమోదు
April 24, 2022
0