హైదరాబాద్ పాతబస్తీలోని షహీన్నగర్కు చెందిన ఇలియాజ్ నవాబ్ (29) పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అతడిపై పహాడిషరీఫ్ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఇతడిపై గతంలో జరిగిన సుల్తాన్ హత్య కేసుతోపాటు పలు కేసులున్నాయి. కొంతకాలంగా భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్న నవాబ్కు ఇతర గ్రూపులతో విభేదాలున్నాయి. ఆదివారం షహీన్నగర్లో కాపుగాసిన నలుగురు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడిచేసి, విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన నవాబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. భూతగాదాలు, ఆధిపత్యపోరులో భాగంగానే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
హైదరాబాద్ లో రౌడీషీటర్ హత్య
March 21, 2022
0
Tags