గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఢిల్లీ మెట్రో రైల్ ఉద్యోగి

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రో రైల్ ఉద్యోగి ప్రఫుల్ సింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో అతి తక్కువ సమయంలో ప్రయాణించి ఈ రికార్డును ప్రఫుల్ సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రో రైల్ పరిధిలో ఉన్న మొత్తం 254 స్టేషన్లను, 348 కిలోమీటర్లు, 16 గంటల 2 నిమిషాల్లో ప్రఫుల్ కవర్ చేశాడు. ఇప్పటి వరకు అంత తక్కువ సమయంలో మెట్రో స్టేషన్లు అన్నింటినీ కవర్ చేసిన వాళ్లు ఎవరూ లేరు. దీంతో ప్రఫుల్ సింగ్ గిన్నిస్ బుక్‌లోకెక్కాడు. ఢిల్లీ మెట్రో రైల్ పేరు చిరస్థాయిలో గిన్నిస్ బుక్‌లో ఉండేలా కృషి చేసిన ప్రఫుల్ సింగ్ ఢిల్లీ మెట్రో రైల్‌లో పనిచేయడం గర్వకారణమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోటో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)