హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. 2014లో జరిగిన తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలపై సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 28న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై అక్రమాస్తుల కేసుతో పాటు పలు కేసులు సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న సంగతి విదితమే. 2014 లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం కోర్టులు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్ తోపాటు మిగతా ఇద్దరికి సమన్లు జారీ చేసింది.
జగన్ కు కోర్టు సమన్లు జారీ
March 24, 2022
0
Tags