రైలుకు ప్లాట్‌ఫాం కి మధ్య చిక్కుకున్న ప్రయాణికుడు

Telugu Lo Computer
0

 

గుజరాత్ లోని సూరత్ రైల్వే స్టేషన్ లో రైలు ప్లాట్ ఫాం పై నుంచి కదిలింది. రైలులో ప్రయాణం చేస్తున్న ఒక యువకుడు ఉన్నట్టుండి రైలులోంచి కిందకు దిగబోయాడు. దీంతో అతను రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకు పోయాడు. ప్లాట్ ఫాంపై ఉన్న జనం ఒక్కసారిగా గట్టిగా అరిచే సరికి అలర్టైన గార్డ్, డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. వెంటనే రైలు ఆగిపోయింది. రైలునుంచి జారి పడిన ఆ వ్యక్తి తాపీగా లేచి ఇవతలకు వచ్చాడు. ఇంత జరిగినా అతనికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని రైల్వేశాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైలు గార్డును, డ్రైవర్ ను అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)