ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


ఐపీఎల్ 15వ సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. ఈ టోర్నీ మార్చి 26న ప్రారంభం కానుంది. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఉంటాయి. 65 రోజుల పాటు మ్యాచ్ లు జరగనున్నాయి. టోర్నీ ఫైనల్ మే 29న జరగనుంది. ఇక ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం రెండు నగరాల్లోనే మ్యాచ్ లు జరగనున్నాయి. ముంబయిలో మూడు స్టేడియాలు, పూణేలో ఒక స్టేడియంలో మ్యాచ్ లు జరుగుతాయి. వాంఖడే, డివై పాటిల్ స్టేడియంలు 20 మ్యాచ్‌ల చొప్పున ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, పూణెలోని ఎంసీఏ మైదానాలు 15 చొప్పున మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)