దేశంలో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి. 23వేల 87 యాక్టివ్ కేసులు ఉండగా, దేశంలో ఉన్న కేసుల్లో అది 0.05 శాతం అని రికార్డులు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 4 కోట్ల 30లక్షల 12వేల 749 కేసులు నమోదు కాగా, 5లక్షల 16వేల 605 మంది మృత్యువాతకు గురయ్యారు. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. కరోనా నుంచి మంగళవారం 2542 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారిలో 4కోట్ల 24లక్షల 73వేల 57 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శఆఖ వెల్లడించింది. దేశంలో 432 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 181.89 కోట్ల డోసులు అందజేశారు. మంగళవారం 30లక్షల 53వేల 897 డోసులు అందాయని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 181కోట్ల 89లక్షల 15వేల 234 డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో 1778 కరోనా కొత్త కేసులు నమోదు !
March 23, 2022
0
Tags