రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్ధూ మృతి

Telugu Lo Computer
0


కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై జరిగిన  రోడ్డు ప్రమాదం పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. ఢిల్లీ నుండి భటిండా వైపుగా కారులో దీప్‌ సిద్ధూ వెళ్తున్నప్పుడు  దీప్‌ సిద్ధూ కారు ఒక ట్రక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో దీప్‌ సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పంజాబ్‌ కు చెందిన దీప్‌ సిద్ధూ పలు పంజాబీ సినిమాల్లో నటించాడు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమానికి దీప్‌ సిద్ధూ మద్దతు పలికారు. ఈ క్రమంలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ పేరుతో చేపట్టిన ఆందోళనలో దీప్‌ సిద్ధూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనల్లో దీప్‌ సిద్ధూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)