దేశంలో 44,877 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతోంది. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఈరోజు మళ్లీ తగ్గిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 44,877 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారి కరోనా కేసులు 3.17 శాతంగా నమోదు అయిందన్న మాట. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,37,045 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 170.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,17,591 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,15,85,711 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 49.16 లక్షల మందికి ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)