విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సెలవులను పొడగించింది. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే.. ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే.. ఇప్పటికే కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే… కేసీఆర్‌ సర్కార్‌ జనవరి 30వ తేదీ వరకు విద్యాసంస్థల సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. తెలంగాణలోని కాలేజీలు, పాఠశాలలు జనవరి 30 వరకు మూత పడనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)