తాతయ్య విందు...!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన ఓ వ్యక్తి తన మనవరాలికి ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజనానికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా సదరు తాతయ్య ఏకంగా 365 వంటకాలతో గోదారోళ్ల మర్యాద ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నిండిపోయింది. వీటిలో అన్నం, పులిహార, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలు తో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్ధాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల డ్రింక్ లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులతో విందు ఏర్పాటు చేశారు. నరసాపురంకి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతులు తమ కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకుకి చెందిన తుమ్మలపల్లి సాయి కృష్ణ తో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. ఈ క్రమంలోనే కాబోయే నూతన వదూవరులకు, వదువు తాతయ్య విందు ఏర్పాటు చేసి గోదారోళ్ల మర్యాదను రుచి చూపించారు. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)