సమయం, స్థలం చెప్పాలంటూ అఖిలేశ్‌ ప్రతి సవాల్‌

Telugu Lo Computer
0


కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. స్థలం, సమయాన్ని ప్రకటించాలని, ప్రతి సవాల్‌నూ స్వీకరించడానికే తాను సదా సిద్ధమేనని అఖిలేశ్ ప్రకటించారు. ఈ మేరకు అఖిలేశ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌లో అఖిలేశ్ ఎక్కడ కూడా అమిత్‌షా పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ముజఫర్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగి హయాంలో గూండాగిరి తగ్గిందని, శాంతిభద్రతలు బాగున్నాయని పేర్కొన్నారు. అఖిలేశ్‌కు దమ్ముంటే తన హయాంలో శాంతిభద్రతల సమస్యకు సంబంధించిన గణాంకాలతో ఓ చర్చ పెట్టాలని అమిత్‌షా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ పై విధంగా స్పందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)