ఛత్తీస్గఢ్లో మొన్నటికి మొన్న ఓ మాజీ ఉప సర్పంచ్ను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను మరవకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మానసిక వికలాంగుడు పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించి జన మిలీషియా సభ్యులు అతడిని బీజాపూర్ జిల్లా బాసగూడలో హత్య చేశారు. వికలాంగుడి కుటుంబ సభ్యలకు ఈ విషయం తెలియడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వికలాంగుడిని హత్య చేసిన మావోయిస్టులు
January 02, 2022
0
Tags