జగన్‌తో చిరంజీవి లంచ్ మీట్!

Telugu Lo Computer
0


టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, జగన్ సర్కార్‌ల మధ్య టిక్కెట్ల ధరల వివాదానికి శుభం కార్డ్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ కలవబోతున్నారు. టికెట్ల ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తున్న సమయంలో గురువారం చిరంజీవి జగన్‌ను కలవబోతున్నారు. వీరి భేటి తర్వాత ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య జరుగుతున్న వివాదానికి పరిష్కారం దొరుకుతుందా అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా ఈరోజు జగన్‌ని కలిసే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్‌తో కలిసి మధ్యాహ్నం లంచ్‌ చేయబోతున్నారు చిరంజీవి. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఈ సమావేశంలో సినిమా టికెట్ల వివాదంపై సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఏం మాట్లాడుతారు? జగన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)