పీటీ ఉషపై చీటింగ్ కేసు

Telugu Lo Computer
0


మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషతో పాటు మరో ఆగురుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు కోళికోడ్ పోలీసులు వెల్లడించారు. జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కోనుగోలు చేసింది. ఆ ఫ్లాట్‌ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ.46 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఫ్లాట్‌ను బిల్డర్ జోసెఫ్‌కు అప్పగించలేదు. పీటీ ఉష హామీ మేరకు బిల్డర్‌కు తాను పూర్తి డబ్బులు చెల్లించానని కానీ, తనకు ఫ్లాట్‌ను అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బిల్డర్‌తో పాటు.. పీటీ ఉష తమను మోసం చేశారని జోసెఫ్ పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)