హైదరాబాద్​లో మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లు?

Telugu Lo Computer
0


హైదరాబాద్​ నగరంలో మళ్లీ కంటైన్​మెంట్​ జోన్లు షురూ అయ్యాయి. ఒమిక్రాన్​ కేసులు తేలిన నేపథ్యంలో టోలీచౌక్​ మొత్తం ఒకే క్లస్టర్​గా చేశారు. కేసులు నమోదైన పారమౌంట్​ కాలనీని పోలీసులు, వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసి జీనోమ్​ సీక్వెన్సింగ్​కు కూడా శాంపిల్స్​ పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఇక నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఒక్కరికి పాజిటివ్​ తేలినా, ఆ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్​ చేసి టెస్టులు చేయనున్నారు. మొదటి, రెండో వేవ్​ లో చేసినట్లే ఈ ప్రక్రియ ఉండనుంది. ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్మెంట్​ విధానం మళ్లీ అమల్లోకి రానుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో కేసులు పెరిగినా క్లస్టర్లుగా విభజించిన సదరు కాలనీల్లో ప్రతి రోజు హైపోక్లోరైట్​ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది , మున్సిపల్​, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్​సిబ్బందిలు ఆ ఏరియాను పర్యవేక్షణ చేయనున్నారు. కంటైన్​మెంట్​ లో ఉన్న వ్యక్తి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువులను జీహెచ్ఎంసీ సిబ్బంది అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 వారాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యశాఖ నొక్కి చెప్పింది. కంటైన్​మెంట్​లు విధించడం వలన వైరస్​ వ్యాప్తిని కంట్రోల్​ చేయొచ్చు. వైరస్​ చైన్​ లింక్​ ను తొలగించే ప్రక్రియనే ఈ క్లస్టర్​విధానం . ఈ పరిధిలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని కలిసే అవకాశం లేనందున వైరస్​కేవలం కంటైన్​మెంట్​కే పరిమితం అవుతుంది. ఇంక్యూబేషన్​ పీరియడ్​ తర్వాత పూర్తిస్థాయి అదుపులోకి వస్తుంది. తద్వారా కేసుల తీవ్రతను సులువుగా అడ్డుకోవచ్చని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి, రెండో వేవ్​లలో వైరస్​ వ్యాప్తిని ఈ విధానంతోనే అడ్డుకున్నట్లు అధికారులు చెప్పారు. అసలు దేశవ్యాప్తంగా కంటైన్​మెంట్​ ప్రక్రియను మన రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మొదటి వేవ్​ సమయంలో మర్కజ్​ వ్యక్తులను గాలింపు చర్యల్లో కరీంనగర్​లో మొదటి సారి కంటైన్​మెంట్​ చేశారు. ఆ తర్వాత కేసులు ఎక్కువగా ఉన్న ప్రతి ప్రాంతంలో ఈ ప్రక్రియను తీసుకువచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)