ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 134 కోట్లను జిల్లాల వారీగా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 2,199 గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల కోసం రూ.134 కోట్ల నిధులను విడుదల చేసింది. ఏకగ్రీవాల్లో 2వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలకు రూ.5 లక్షలు, 2వేల - 5 వేల లోపు రూ.10లక్షలు, 5వేల - 10 వేల లోపు రూ.15 లక్షలు, 10 వేల కంటే మించి జనాభా కలిగిన పంచాయతీలకు రూ.20 లక్షలు కేటాయించారు.
ఏకగ్రీవాలకు నిధుల విడుదల
December 27, 2021
0
Tags