హైదరాబాద్ లోని దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్ కు చెందిన భరత్ భూషణ్, సాయి తేజ అన్నదమ్ములు. వీరిద్దరూ ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నారు. తల్లికి పక్షవాతం రావడంతో ఆమె మంచానికే పరిమితం అయ్యారు. అయితే అన్నదమ్ములిద్దరూ ప్రతిరోజు తాగి గొడవ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన రాత్రి కూడా ఇద్దరు తాగి గొడవ పడ్డారు. దాంతో కోపంతో రగిలిపోయిన తమ్ముడు సాయి తేజ అన్న భరత్ భూషణ్ పై కుక్కర్ తో దాడి చేశాడు. ఈ దాడిలో భరత్ భూషణ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం అన్నను లేపడానికి ప్రయత్నించగా అతడు చనిపోయినట్టు గుర్తించాడు. దాంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నను కుక్కర్ తో కొట్టి చంపిన తమ్ముడు
December 27, 2021
0
Tags