రోశయ్యకు తుది వీడ్కోలు

Telugu Lo Computer
0



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కు కొంపల్లిలోని ఫాంహౌజ్‌ లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు. అంతకు ముందు గాంధీభవన్‌లో కొద్ది సేపు రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో పాలు పలువురు సీనియర్‌ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో రోశయ్య అజాత శత్రువుగా నిలిచారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. ఆ సమయం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ దగ్గరే ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)