బాల భీముడు !

Telugu Lo Computer
0

 

తెలంగాణ లోని భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. పాల్వంచకు చెందిన శ్రావణి నెలలు నిండడంతో ప్రసవం కోసం భద్రాచలంలోని సురక్ష ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు డాక్టర్‌ శ్రీక్రాంతి, డాక్టర్‌ అక్కినేని లోకేష్, నర్సుల బృందం  ఆపరేషన్‌ చేశారు. శ్రావణికి పండంటి బాబు జన్మించగా.. శిశువు ఐదు కిలోల బరువు ఉన్నాడు. సహజంగా పిల్లలు రెండున్నర నుంచి నాలుగు కిలోల వరకు జన్మిస్తారని, ఐదు కేజీలు ఉండడం అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా అధిక బరువుతో జన్మిస్తారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వివరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)