ఎలక్ట్రిక్​ ఎయిర్​ ట్యాక్సీని పరీక్షిస్తున్న నాసా

Telugu Lo Computer
0


బ్యాటరీల సాయంతో విమానం ఎగిరే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం వాడుతున్న ఇంధనంతో సంబంధం లేని విమానయానాన్ని మనం చూడగలం. విమానయాన రంగం ఇంధన విమానాల నుంచి హైబ్రీడ్, ఎలక్ట్రిక్ విమానాల వైపు చాలా వేగంగా మళ్లడమే దీనికి కారణం. అందులో భాగంగానే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిక్​ ఎయిర్​ ట్యాక్సీని పరీక్షించడం మొదలుపెట్టింది. జోబీ ఏవియేషన్​తో కలిసి ఈ పరీక్షను చేస్తోంది. ఈ ఎయిర్​ ట్యాక్సీలను వ్యక్తులు, వస్తువులు తరలించడానికి వినియోగించనున్నారు. అమెరికా, కాలిఫోర్నియాలోని బిగ్ సుర్ సమీపంలో ఉన్న జోబి ఎలక్ట్రిక్ ఫ్లైట్ బేస్లో  సెప్టెంబర్ 10 వరకు ఈ పరీక్షను నాసా కొనసాగిస్తుంది. నాసా తన అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ  నేషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా మొట్టమొదటి సారిగా ఈ ఎలక్ట్రిక్​ వెర్టికల్​ టేకాఫ్​ లాండింగ్​  విమానం పరీక్ష నిర్వహిస్తోంది. ఒకవేళ ఈ పరీక్ష విజయవంతం అయితే ఇక సామాన్య ప్రయాణికుడు సైతం ఈ ఎయిర్​ ట్యాక్సీలను బుక్​ చేసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)