రూ.70,120 కోట్ల రీఫండ్ చెల్లింపు

Telugu Lo Computer
0


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 6 వరకూ రూ.70,120 కోట్ల ఆదాయపు పన్ను రిఫండులను చెల్లించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఇందులో 24.70 లక్షల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.16,753 కోట్లు రిఫండులు ఇచ్చినట్లు పేర్కొంది. ఇక కార్పొరేట్‌ విభాగంలో 1.38 లక్షల మందికి రూ.53,367 కోట్లు చెల్లించినట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 6 వరకూ మొత్తం 26609 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)