హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త, మామల వేధింపులే కారణమని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు పావని స్వగ్రామం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్. పెద్దల అంగీకారంతో ఏడాది క్రితం పావని, శ్రావణ్ కుమార్ రెడ్డి పెళ్ళి చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి భర్త మోసం చేశాడు. వివాహం జరిగిన వారం నుంచే భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధింపులకు దిగారని ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శ్రావణ్ కుమార్ రెడ్డి, అత్త శకుంతల, మామ హిమవంత్ రెడ్డి, ఆడబిడ్డ మౌనికతో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.