ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా రికవరీలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో రికవరీలు 20 లక్షల మార్క్‌ దాటాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,226 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,00,877కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 45,533 పరీక్షలు నిర్వహించగా.. 1,190 కొవిడ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,29,985 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 11 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,998కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,110 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,24,895 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)