17 నుంచి కిరాణా డోర్ డెలివరీ సేవలు బంద్

Telugu Lo Computer
0


ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో తన కిరాణా డోర్ డెలివరీ సేవలను సెప్టెంబర్ 17 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల నుంచి ఆశించినంత రీతిలో స్పందన రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. గ్రోఫర్స్ సంస్థ ఇతర కిరాణా సంస్థల కంటే మెరుగైన ఫలితాలను సృష్టిస్తుందని నమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది. జొమాటో తన కిరాణా భాగస్వాములకు ఒక ఈ-మెయిల్ లో ఇలా పేర్కొంది.. "జొమాటో మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, మా వ్యాపార భాగస్వాములకు మరిన్ని లాభాలను అందించాలని మేము ఆశించాము. మా కస్టమర్లకు, మర్చంట్ భాగస్వాముల ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి ప్రస్తుత మోడల్ అత్యుత్తమ మార్గం కాదని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల, మా పైలట్ కిరాణా డెలివరీ సేవలను 17 సెప్టెంబర్, 2021 నుంచి నిలిపివేయాలని మేం భావిస్తున్నాం'' అని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)