నీట మునిగిన సంగమేశ్వరుడు..!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు పొటెత్తింది. దీంతో ఆలయం మొత్తం నీటిలో మునిగింది. కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది.ఈనెల 20న గర్భగుడిలోకి రెండు అడుగుల మేర నీరు రాగా, ఇప్పుడు గుడి గోపురం మాత్రమే కనిపించేలా నీటిలో మునిగింది.  దీంతో పూజారులు కృష్ణమ్మకు హారతి ఇచ్చి, సంగమేశ్వరుడికి అంత్య పూజలు నిర్వహించి సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)