ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు శుభవార్త !

Telugu Lo Computer
0


ఎయిర్‌టెల్‌ కస్టమర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ కనెక్షన్లను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు . వినియోగదారులకు నచ్చిన విధంగా ప్లాన్స్ రూపొందించుకోవచ్చు. ఇక కంపెనీప్రకటించిన నెలవారీ ప్లాన్లు ఫైబర్ నెట్ వర్క్ రూ.499, డీటీహెచ్ రూ. 153, మొబైల్ రూ.499 నుంచి మొదలవుతాయి. కంపెనీ ప్రవేశపెట్టిన నాలుగు రకాల ప్లాన్స్‌లో వినియోగదాలు దేనినైనా ఎంచుకునే అవకాశం ఇచ్చింది. రూ.1598 ప్లాన్ తో రెండు మొబైల్స్, ఒక ఫైబర్ నెట్ వాడుకోవచ్చు. రూ.1349 ప్లాన్ తో మూడు మొబైల్స్, ఒక డీటీహెచ్ ని ఉపయోగించవచ్చు. రూ.2,099 ప్లాన్‌ కింద మూడు మొబైల్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్‌ కనెక్షన్‌ వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్స్ కి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఇన్‌స్టాలేషన్, సర్వీస్‌ చార్జీలు వుండవు. 

Post a Comment

0Comments

Post a Comment (0)