అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ విద్యార్థి మృతి !

Telugu Lo Computer
0


మెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక వైద్యుడు నవీన్-స్వాతి కుమారుడు ముక్క నివేశ్ (20) గతేడాది జనవరిలో ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. ప్రస్తుతం నివేశ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. దాంతో నివేశ్తో పాటు సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్, స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై అరిజోనా పోలీసులు సమాచారం అందించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)