కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే వెయ్యి రూపాయల జరిమానా !

Telugu Lo Computer
0


హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ పై టూవీలర్స్ ను ఎక్కువ మంది పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. బ్రిడ్జ్ పై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై బ్రిడ్జ్ పై వాహనాన్ని ఆపితే రూ.1000 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదాల నివారణకే ఈ జరిమానాలు అని స్పంష్టం చేశారు. బ్రిడ్స్ వరకు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చని… బర్త్ డే కేక్ లు కట్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ పై కేక్ కటింగ్స్ బ్యాన్ చేశామని అన్నారు. వాహనదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. ఇకపై బ్రిడ్జ్ వద్ద ఎక్కువ మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)