మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బుధవారం కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు. ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కూటమి నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఎవరికి తోచినట్టుగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే పంజాబ్ లో లోక్ సభ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపి సందీప్ పాఠక్ కాంగ్రెస్ పార్టీకి ఒక లోక్సభ సీటును “పొత్తు ధర్మాన్ని” దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ రాజధానిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను ఆప్ గెలుపొందగా, కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్కు విభాకర్ శాస్త్రి రాజీనామా !
February 14, 2024
0
Tags