పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ వెన్నులో వణుకు పుడుతోందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం బాధాకరమన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోడీ నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్య పాలనపై ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోసింగ్ మాట్లాడిన వీయోడును వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలించింది. ప్రజలంతా గమనించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరమన్నారు.
బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం !
April 23, 2024
0
Tags