గుజరాత్ లోని రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 434 పరుగుల భారీ తేడాతో ఇండియా ఈ మ్యాచ్ గెలిచింది. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు, జైస్వాల్ డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ రెండు హాఫ్ సెంచరీలతో పాటు, జడేజా, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అశ్విన్ సూపర్ బౌలింగ్తో టీమిండియా ఈ మ్యాచ్ను గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా, ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌట్ చేసింది. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి.. ఇంగ్లండ్ ముందు 557 టార్గెట్ను ఉంచింది. ఈ భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో.. ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో టీమిండియా ముందంజలోకి వచ్చింది.
మూడో టెస్ట్లో టీమిండియా ఘన విజయం
February 18, 2024
0
Tags