అమృత్‌పాల్ సింగ్ జైలు గది నుంచి సెల్‌ఫోన్, స్పైకామ్ ?

Telugu Lo Computer
0


స్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైల్లో భారీ భద్రత కలిగిన జైలులో ఖలిస్తానీ నేత, వివాదాస్పద వేర్పాటువాది, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు ఉన్నారు. అయితే ఆ జైలులో భద్రత ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్, అతని తొమ్మిది మంది సహచరులు ఉన్న సెల్ నుంచి స్పై కెమెరాలు, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ ఇతర వస్తువులను అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అస్సాం ఉన్నత పోలీస్ అధికారి జీపీ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సెక్యూరిటీని మరింత టైట్ చేసినట్లు, సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఉదయం జైలు సిబ్బంది జైల్ గదుల్లో శోధించగా.. పలు వస్తువులు బయటపడినట్లు తెలిపారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)