హైదరాబాద్ లో పెరిగిన ఉష్ణోగ్రతలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో ఈసారి అప్పుడే ఎండలు ప్రారంభమైయ్యాయి. మార్చి రాకముందే ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ఏరియాల్లో కనిష్ణ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు నమోదవ్వగా..కొన్ని ఏరియాల్లో 35 డిగ్రీ వరకు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడైనా ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల వరకు నమోదయ్యేవి.. కానీ ఈ సారి 34 డిగ్రీలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)